Header Banner

రైతులకు పండగలాంటి వార్త.. మళ్లీ ఖాతాల్లో డబ్బులు! మోడీ కీలక నిర్ణయం.. వెంటనే చెక్ చేసుకోండి!

  Sun Feb 23, 2025 15:37        Politics

రైతులకు పెట్టబడి సాయం అందించే లక్ష్యంతో పీఎం కిసాన్ పథకాన్ని కేంద్రం అమలు చేస్తోంది. అందులోభాగంగా 19వ విడత నిధులు విడుదలకు తేదీని ప్రభుత్వం ఖరారు చేసింది. రేపు అంటే.. ఫిబ్రవరి 24వ తేదీన రూ. 2 వేలు చొప్పున రైతుల ఖాతాల్లో నగదు జమ చేయనుంది. బిహార్‌లోని భాగల్పూర్‌లో జరిగే కార్యక్రమంలో ప్రధాని మోదీ ఈ నిధులను విడుదల చేయనున్నారు. ఈ విడతలో 9.7 కోట్ల మంది రైతులకు ప్రయోజనం కలగనుందని ఉన్నతాధికారులు వెల్లడించారు. పీఎం కిసాన్‌ నిధులు అందుకోవాలంటే అర్హులైన రైతులు ఎన్‌పీసీఐ, ఆధార్‌తో అనుసంధానించిన బ్యాంకు అకౌంట్ కలిగి ఉండాల్సి ఉంది. అలాగే, ఇ-కేవైసీ సైతం చేసి ఉండాల్సి ఉంటుంది. మరోవైపు పీఎం కిసాన్‌ పథకానికి సంబంధించిన స్టేటస్ తెలుసుకోవాలనుకొన్నా.. పీఎం కిసాన్‌ జాబితాలో మీ పేరు ఉందో, లేదో చూడాలనుకొన్న తొలుత https://pmkisan.gov.in/లోకి వెళ్లి చెక్‌ చేసుకోవచ్చు.

 

ఇది కూడా చదవండి: కొత్త రేషన్ కార్డులకు గ్రీన్ సిగ్నల్.. ముహూర్తం ఫిక్స్! అర్హతలు, మార్గదర్శకాలు ఇవే!

 

ఆయా వివరాలు పొందడానికి రిజిస్టర్డ్‌ మొబైల్‌ నంబర్‌/ ఆధార్‌ నంబర్‌ ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది. పీఎం కిసాన్‌ మొబైల్‌ యాప్‌ కూడా అందుబాటులో ఉందన్న సంగతి అందరికి తెలిసిందే. గత విడుత అంటే..18వ విడత, 2023, అక్టోబర్ 5వ తేదీన మహారాష్ట్రలోని వాషిమ్ వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేసిన విషయం విధితమే. ఈ విడతలో దాదాపు 9 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.20 వేల కోట్ల నగదును జమ చేశారు. రైతులకు పెట్టబడి, ఆర్థిక సాయంతోపాటు వారి జీవనోపాధిని మెరుగు పరచడమే లక్ష్యంగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని 2019లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకం కింద అర్హులైన రైతులకు ఏడాదికి రూ.6 వేలు చొప్పున ఆర్థిక సహాయం అందిస్తోంది. ఈ మొత్తం ఏడాదిలో మూడు విడతలుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ. 2,000 చొప్పున జమ చేస్తుంది. ఈ పథకం ప్రారంభం నాటి నుంచి ఇప్పటి వరకు 18 విడతలుగా దాదాపు రూ. 2 లక్షల కోట్లకు పైగా రైతుల ఖాతాలకు నగదు జమ చేశారు.

 

ఇది కూడా చదవండి: జగన్ కి మరో షాక్.. కిడ్నాప్, హత్యాయత్నం కేసులో వైసీపీ నేత అరెస్టు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్.. ప్రతీ సంవత్సరం ప్రతీ వ్యక్తికీ రూ.25లక్షలు.. ఏప్రిల్‌లో ప్రారంభం!

 

ఏపీ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్.. ప్రతీ సంవత్సరం ప్రతీ వ్యక్తికీ రూ.25లక్షలు.. ఏప్రిల్‌లో ప్రారంభం!

 

ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. యుద్ధం ముగియాలంటే అదొక్కటే మార్గం!

 

ప్రజలకు అప్డేట్.. ఆధార్ కార్డులో కొత్త మార్పు! ఇది తెలుసుకోకపోతే నీ పరిస్థితి ఇక అంతే!

 

ఆంధ్రప్రదేశ్ లో మరో కొత్త హైవేకు లైన్ క్లియర్! ఈ జిల్లాలకు మహర్దశ!

 

పోలీసులపై చండాలమైన కామెంట్స్ చేసిన జగన్! ఆ కేసు పెట్టి జైలుకు పంపండి.. ఏపీ మంత్రి డిమాండ్!

 

గుంటూరులో జగన్‌ పర్యటన.. మిర్చి రైతులకి కన్నీరు.. 14 మిర్చి టిక్కీలు మాయం! యార్డ్ సీసీటీవీలలో..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #PMModi #Delhi #Earthquake